ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మెన్‌.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మెన్‌.
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్ :
హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట్‌లోని TGSPDCL-గోల్నాక సెక్షన్‌కు చెందిన లైన్‌మెన్‌ వి. శివ మల్లేష్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కమర్షియల్‌ విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చే విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు, అలాగే ఫిర్యాదుదారుడి పాత విద్యుత్‌ మీటర్‌లో ఉన్న అవకతవకలపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అతడు రూ.50,000/- లంచం డిమాండ్ చేశాడు.

ఫిర్యాదుదారుడి తరఫున పి. సంతోష్ అనే ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా ఈ లంచం డిమాండ్‌ చేయగా, ఈ డీల్‌ ప్రకారం రూ.30,000/- తీసుకుంటుండగా తెలంగాణ ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన అధికారులు మరింత విచారణ చేపట్టారు.

ఇలాంటి అవినీతి చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏసీబీకి సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!