వట్టం నారాయణ దొరకు టీడీపీ కీలక బాధ్యత – భద్రాచలం పరిశీలకులుగా నియామకం
భద్రాచలం ఆధాబ్ న్యూస్: తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా, గ్రామ/వార్డు మరియు మండల/పట్టణ/డివిజన్ స్థాయిలో కమిటీల ఏర్పాటు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా పినపాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు వట్టం నారాయణ దొరను పార్టీ నియమించింది.
పార్టీకి ఎంతోకాలంగా విశ్వసనీయంగా సేవలందిస్తున్న నారాయణ దొరకు ఈ కీలక బాధ్యత అప్పగించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఆయన నాయకత్వంలో భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నియామకంతో పినపాక నుంచి టీడీపీ నాయకులకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పటిష్టత కోసం ఆయన తీసుకునే చర్యలు ఫలితాలు ఇవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.









