ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రేపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. విజయవంతం చేయండి మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

రేపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. విజయవంతం చేయండి మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రేపు సోమవారం (05-05-2025) కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం, తాటిగూడెం, వెంకటాపురం, వట్టం వారి గుంపు, చిరుమళ్ళ గ్రామాల్లో పర్యటించనున్నాడు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నాడు.
పర్యటన షెడ్యూలు ఇలా

ఉదయం 8:30 గంటలకు – రఘునాథపాలెంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం, అనంతరం సమీక్ష సమావేశం.

తాటిగూడెం, వెంకటాపురం, వట్టం వారి గుంపు, చిరుమళ్ళ గ్రామాల్లో నిర్మితమైన నూతన సిసిరోడ్ల ప్రారంభోత్సవాలు.

ఈ పర్యటన ద్వారా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి, స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చించే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పిలుపునిచ్చాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!