పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కామిరెడ్డి వారి వివాహ వేడుకలో పాల్గొన్న సందర్భం
బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం నాడు జరిగిన వివాహ వేడుకలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కామిరెడ్డి సుబ్బారెడ్డి, ఏగమ్మ దంపతుల కుమారుడు యోగేందర్ రెడ్డి వివాహం పావనితో సంప్రదాయబద్ధంగా జరగగా, ఈ శుభకార్యానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
వివాహ వేడుకకు బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Post Views: 33









