మణుగూరు తాసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మానియేల్కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల శుభాకాంక్షలు.
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలో నూతన తాసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మానియేల్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లను మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, పూలగుచ్చం అందజేశారు.
అనంతరం పాయం వెంకటేశ్వర్ల, నూతన తాసీల్దార్కు తినుబండారంతో ఆదరాభిమానాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Post Views: 38









