మరమ్మత్తుల కారణంగా వ్యవసాయ మోటార్లకు సరఫరా నిలిపివేత
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలానికి చెందిన విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన ముఖ్య సమాచారం. రేపు బుధవారం (30-04-2025) ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 4:00 గంటల వరకు 33/11 కె.వి. కరకగూడెం ఉపకేంద్రంలో 33 కె.వి. కరకగూడెం లైన్పై నిర్వహించబోయే మరమ్మత్తు పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఏఈ నరేందర్ రెడ్డి తెలిపారు
ఈ వ్యవధిలో కరకగూడెం మండలంలో సింగిల్ ఫేస్ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. వ్యవసాయ మోటార్లకు సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరమ్మత్తులు పూర్తి అయిన వెంటనే పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని వారు తెలిపారు.
Post Views: 55









