దివ్యాంగుల అభ్యున్నతికి శుభవార్త: రాజ్ యువ వికాసంలో 5% రిజర్వేషన్ – మంత్రి సీతక్క
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు. రాజ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా 5 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ పథకం ద్వారా యువతకు ఉపాధి, శిక్షణ, ఆర్థిక స్థిరత్వం లాంటి అవకాశాలు లభించనున్నాయి.
సీతక్క మాట్లాడుతూ, “దివ్యాంగులు సమాజంలో సమాన హక్కులతో ఎదగాలి. వారి ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునిస్తుంది” అని చెప్పారు.
అదనంగా, కుటుంబంలో ఎవరైనా దివ్యాంగులుగా ఉంటే, వారికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలనలో పెట్టిందని వెల్లడించారు.
దివ్యాంగుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పిన సీతక్క, అవసరమైన వారికి అత్యవసర శస్త్రచికిత్సలు ఉచితంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు.
ఈ చర్యలు దివ్యాంగులకు ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో మెరుగుదల కలిగించే దిశగా ముఖ్యమైన అడుగుగా నిలవనున్నాయి.









