ప్రతి క్షణం
ప్రజల పక్షం

  డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ వైస్ చైర్‌పర్సన్‌గా శాంతి కుమారి ఐఏఎస్ నియామకం

డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ వైస్ చైర్‌పర్సన్‌గా శాంతి కుమారి ఐఏఎస్ నియామకం

ఆధాబ్ న్యూస్ ,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐఏఎస్‌ను డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆమె ఈ నెల 30న పదవీవిరమణ చేసిన వెంటనే ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPL-A) విభాగం 2025 ఏప్రిల్ 28న G.O. Rt. No.523 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నియామకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు త్వరలో వేరుగా విడుదల కానున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వులను కార్యదర్శి ఎం. రఘునందన్ రావు జారీ చేశారు. శాంతి కుమారి ప్రస్తుతం ఉన్నత పరిపాలన అనుభవం కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆమెకు సీఏస్‌గా సేవలందించిన అనుభవం ఈ కొత్త బాధ్యతలో ఉపయోగపడనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్