పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఇరవైండి గ్రామంలో ఘన స్వాగతం.
బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఇరవైండి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ నాభిశిల బొడ్రాయి, ముత్యాలమ్మ మరియు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయి వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి గుడిలో ముత్యాలమ్మ తల్లి దర్శనం చేసుకుని హారతులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
Post Views: 32









