ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాచలంలో శ్రీ సీతారాముని దర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ రవిచంద్ర – పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు

భద్రాచలంలో శ్రీ సీతారాముని దర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ రవిచంద్ర – పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు

భద్రాచలం,ఆధాబ్ న్యూస్: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భక్తిపూర్వకంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వారితో పాటు భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేతలు ఆలయ పరిసరాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, “భద్రాచల లక్ష్మీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం,” అని చెప్పారు. ఆలయ సందర్శనలో పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్