కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో 108 అంబులెన్స్ లో EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)గా విధులు నిర్వహిస్తున్న దోమల ప్రణయ్ గత డిసెంబర్ 13న అకాల మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ అతని కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
తెలంగాణ 108 స్టేట్ హెడ్ ఆపరేషన్స్ MA ఖాలీద్ తెలిపిన వివరాల ప్రకారం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు సంస్థ తరఫున ₹5 లక్షల పరిహారం అందజేస్తారని తెలిపారు. ఈ మొత్తం ఉద్యోగస్తుల నామినీకి అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, తాజాగా EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ముఖ్య కార్యాలయంలో దోమల ప్రణయ్ కుటుంబ సభ్యులకు ₹5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హెడ్ ఆపరేషన్స్ MA ఖాలీద్ , హెచ్ ఆర్ హెడ్ కిరణ్ కిషోర్ పాల్గొని చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.









