కరకగూడెం మండలానికి రేపు విద్యుత్ అంతరాయం.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్ : కరకగూడెం మండలంలో మంగళవారం నాడు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 33/11 కేవీ కరకగూడెం ఉపకేంద్రంలో 33 కేవీ లైన్ మరమ్మత్తులు, ముఖ్యంగా చెట్టు కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ కారణంగా ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మండలంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆపరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి తమ పనులను సకాలంలో సర్దుబాటు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Post Views: 51









