మండల అధ్యక్షుడు పిరినకి నవీన్ .
ఆధాబ్ న్యూస్, మణుగూరు:
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశానుసారం మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ రామాలయం వీధిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని రానున్న పంచాయితీ ఎన్నికల్లో మల్లి కాంగ్రెస్ జెండాను ఎగరవేసే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసి అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రభుత్వ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారని ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లును పేదలకు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ రామాలయం విధి నాయకులు పద్మల సత్యనారాయణ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూరపాటీ సౌజన్య,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గాండ్ల సురేష్, టి వి సుబ్బారెడ్డి, ఐఎన్టీయూసి నాయకులు నిట్ట జీవరత్నం,ఙి.వి,విజయ్,పార్వతి, డ్వాలి, నాజమా, త్రిమూర్తులు, వెంకట్రావు గౌడ్, యాకుబ్ అలీ,అబ్దుల్లా, జోగా సరయ్య తదితరులు పాల్గొన్నారు..









