ఆధాబ్ న్యూస్,పినపాక: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో మంచినీటి శుభ్రత, వాడకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బోరు బావులు, బావులు పంపుల వద్ద శుభ్రం చేయించి, మంచినీటిలో క్లోరినేషన్ చేయించడం జరిగిందని ఏఈ విజయ్ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల పరిధిలో ఎటువంటి మంచినీటి సమస్య ఉన్న వెంటనే తెలియజేయాలని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రవీణ్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 105









