కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
కరకగూడెం మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల కు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరపున సమ్మె నోటీస్ అందజేసిన.సమగ్ర శిక్ష జిల్లా ఉపాధ్యక్షులు జయబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం టి ఎస్ ఎస్ యు పిలుపుమేరకు రాష్ట్రంలోనే అన్ని జిల్లా కేంద్రాలలో 6,7 తేదీల్లో రెండు రోజులు నిరాహార దీక్షలు చేస్తూ చర్చలకు ప్రభుత్వం దిగిరాకపోతే డిసెంబర్ 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరూ సమ్మెకు వెళ్తున్నామని ఉద్యోగులందరూ కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి లేదా తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలాధ్యక్షుడు డి గురవయ్య , ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి, మండల మహిళా వర్కింక్ ప్రెసిడెంట్ వసుధ(KGBV), కోశాధికారి విజయ కుమారి, టీచర్స్(KGBV) సంధ్య, ప్రవీణ సీఆర్పీలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.









