కిన్నెరసాని పర్యటక ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ . భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్ 1 ఆధాబ్ న్యూస్:
పాల్వంచ కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.
కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని తిరుగుతూ
మరింత అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.టూరిజం, ఫారెస్ట్, కేటీపీఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ,సౌకర్యాలు కల్పించాలి.పర్యాటకులను ఆకర్షించే విధంగా వెదురు బొంగు లతో కట్టడాలు చేయాలని కలెక్టర్ సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో టూరిజం, ఫారెస్ట్,కేటీపీఎస్ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post Views: 96









