కరకగూడెం,నవంబర్ 6 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం టిడిపి మండల నాయకులు సిరి శెట్టి. కమలాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ హడాక్ కమిటీ కన్వీనర్ కొండపల్లి రామచందర్ రావు హాజరై టిడిపి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం ఉండి ప్రమాదం జరిగి మరణిస్తే నామినికి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అని మరణం ఎలా జరిగిన తక్షణ సాయంగా కింద 10 వేలు ఇవ్వడం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు 100 రూ తో సభ్యత్వం తీసుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీ ని బలోపేతం చేయాలి.రాబోయే పంచాయతి ఎన్నికలో అన్ని గ్రామ పంచాయతిలలో పోటీలో ఉండాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో హడాక్ కమిటి సభ్యులు, వట్టం నారాయణ, పోటు రంగారావు, వాసిరెడ్డి చలపతిరావు, బూర్గంపహాడ్ మండల అధ్యక్షులు తాళ్లూరి జగదీశ్వరావు, గుండాల మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య, పినపాక అధ్యక్షులు తోట వెంకటేశ్వరరావు, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు పరమేశ్వరాచారి, మాజీ సర్పంచ్ బచ్చల భారతి. కంచెటి వెంకటేశ్వరరావు ఎస్.కె బేగం, పాయం లక్ష్మినారాయణ,వాసు ఇల్లందుల , నరసింహులు వీసం సత్యనారాయణ, అవుదొడ్డి శ్రీను,కళ్యాణ్, రాజేష్ సాయి ,తదితరులు ఉన్నారు.









