ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అమ్మవారి సన్నిధిలో ఘనంగా నాగుల చవితి వేడుకలు.

-అమ్మవారి సన్నిధిలో ఘనంగా నాగుల చవితి వేడుకలు.

ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఉల్లి నరసింహాచార్యులు.

కరకగూడెం, నవంబర్  5 (ఆధాబ్ న్యూస్ ): మండలం లోని రాళ్లవాగు శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నాగుల చవితి వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఉల్లి నరసింహాచార్యులు  ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయం శుభ్రపరచబడిందని, అందంగా పూలతో, రంగుల తోరణాలతో అలంకరించబడింది వారు తెలిపారు. ఆధ్యాత్మిక శాంతిని పెంచే విధంగా భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. దేవాలయంలోని ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.ఈ వేడుకలలో ప్రత్యేకంగా దేవికి అభిషేకం, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. నాగుల చవితి పర్వదినం సందర్భంగా భక్తులకు ప్రత్యేక సేవలు అందించడం జరిగిందన్నారు. పెద్దమ్మ తల్లి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పూజారులు దేవికి ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు . భక్తులు కూడా తమ సామర్థ్యానుసారం నైవేద్యాలు సమర్పించారు. ఈ వేడుకలలో భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికతను అనుభూతి చెందేలా ఏర్పాట్లు జరిగిందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్వయంగా ఏర్పాట్లు చేసారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు అందరూ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!