ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు – భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు – భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
పాల్వంచలోని నవ భారత ప్రాంతంలో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటించనుండడంతో జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బందోబస్తు వివరాలు:

అదనపు ఎస్పీలు – 01

డీఎస్పీలు – 05

సిఐలు – 30

ఎస్సైలు – 62

ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు – 300

హోమ్‌గార్డులు – 160

స్పెషల్ పార్టీలు – 07

ఏఆర్ ప్లాటూన్లు – 02

మొత్తం 900 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పర్యటన భద్రత కోసం నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో మోహరించనున్నట్లు ఎస్పీ వివరించారు.

భద్రతకు 15 సెక్టర్లు:
సీఎం పర్యటన మార్గాన్ని 15 సెక్టర్లుగా విభజించి, ప్రతి సెక్టర్‌కు డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు తెలిపారు. ప్రత్యేక భద్రతా బృందాలు అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తాయని ఎస్పీ చెప్పారు.

అనుమానాస్పదులపై కఠిన చర్యలు:
పర్యటన సమయంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సిబ్బందికి ఆదేశించారు. తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….