ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  మణుగూరులో 3.5 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురిపై కేసు నమోదు

మణుగూరులో 3.5 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురిపై కేసు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్:
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న “చైతన్య – డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమం ఫలితంగా ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ప్రజల సమాచారంతో మణుగూరు పోలీస్‌లు మరో గంజాయి కేసును ఛేదించారు.

మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నివసించే చల్లా శ్రీనివాస్ (S/o నరసయ్య) ఇంట్లో గంజాయి నిల్వ ఉందని అందిన సమాచారం మేరకు పోలీసులు సోదా చేశారు. డీఎస్పీ ఆదేశాలపై, గవర్నమెంట్ పంచుల సమక్షంలో నిర్వహించిన సోదాలో 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, తన అన్నకొడుకు చల్లా సతీష్ మరియు అతని స్నేహితుడు రేపాకుల సాగర్ కలిసి సీలేరు ప్రాంతం నుండి గంజాయి తెచ్చి అమ్ముతుంటారని, తాను కూడా ఆ ఉద్దేశ్యంతో నిల్వ ఉంచినట్లు వెల్లడించాడు.

ఈ వివరాల ఆధారంగా మణుగూరు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. చల్లా శ్రీనివాస్‌ను రిమాండ్‌కు పంపగా, చల్లా సతీష్ మరియు రేపాకుల సాగర్‌లను ఇప్పటికే ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….