ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  దివ్యాంగుల చట్టం-2016 పోస్టర్లను ఆవిష్కరించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

దివ్యాంగుల చట్టం-2016 పోస్టర్లను ఆవిష్కరించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం 2016పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ…
దివ్యాంగులను కించపరచడం, అవహేళన చేయడం, అవయవ లోపాలను ఎగతాళి చేయడం, అవమానకరంగా ప్రవర్తించడం, వారి పరికరాలను ధ్వంసం చేయడం వంటి చర్యలు దివ్యాంగుల చట్టం 2016లో నేరంగా పరిగణిస్తారని తెలిపారు.

ఈ నేరం రుజువైతే 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే రూ.10 వేల నుండి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారని వివరించారు. సమాజంలో దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే జిల్లా అధికారులతో కలిసి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి సాయిరాం, కార్యదర్శి అన్నం సత్తిబాబు, ఉపాధ్యక్షుడు కిష్టా శ్రీనివాస రావు వాల్మీకి, సామాజిక ఉద్యమ నాయకులు అలవాలరాజా పెరియార్, పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షుడు కొమ్మగిరి వెంకటేశ్వర్లు, అప్పన్న దాసు బాబు, మద్దెల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

— భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ, భద్రాచలం

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….