ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  సమర్థవంతమైన ఆరోగ్య సేవలు అందించడంలో రాజీ లేదు – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

సమర్థవంతమైన ఆరోగ్య సేవలు అందించడంలో రాజీ లేదు – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
జిల్లా వ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. త్వరలో జరగనున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమం నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చాతకొండ పల్లె దవాఖాన, ఆయుష్మాన్ కేంద్రాలను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, ఔషధ నిల్వలు, శుభ్రత–శానిటేషన్, ల్యాబ్‌, ప్రసూతి గది, పేషెంట్ వేటింగ్ హాల్స్‌ వంటి విభాగాల పనితీరును సమీక్షించారు.

ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు చేరువగా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి లోపాలు సహించబోమని హెచ్చరించారు.

ప్రభుత్వ ఆరోగ్యపథకాల ప్రయోజనం గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని అన్నారు.

కేంద్ర ఆరోగ్య బృందం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆయన ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయలక్ష్మి, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….