ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  రెవెన్యూ కాలనీలో పారిశుద్ధ్యం లేమిపై సిపిఐఎం ఆందోళన

రెవెన్యూ కాలనీలో పారిశుద్ధ్యం లేమిపై సిపిఐఎం ఆందోళన

భద్రాచలం,ఆధాబ్ న్యూస్: భద్రాచలం పట్టణంలోని రెవెన్యూ కాలనీలో పారిశుద్ధ్యం లేక ప్రజలు రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంబీ నర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిపిఐఎం 11వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో నిర్వహించిన సమస్యల అధ్యయన యాత్రలో ఆయన మాట్లాడారు.

మూడు నెలల క్రితం పంచాయతీ అధికారులు రోడ్డు మరమ్మతుల కోసం తోలిన గ్రావెల్ మట్టిని చదును చేయకపోవడంతో మురుగు నీరు వీధుల్లో నిలిచిపోయి దోమలు, పందులు తిరుగుతూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు తమ ఆవేదనను నాయకుల ముందు వెల్లడించారు.

ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున ఉన్న రెవెన్యూ కాలనీ మురికివాడలా మారిందని, అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు, పారేల్లి సంతోష్ కుమార్, శాఖ కార్యదర్శి పుణ్యవతి, నాయకులు రౌతు గణపతి, గుండ్ల రాణి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు ఎర్రంశెట్టి పూర్ణిమ, సూరమ్మ, సావిత్రమ్మ, రాజ్యలక్ష్మి, మణమ్మ, సరిత, శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….