ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలో ముందుకు నడిపిన దూరదృష్టి నాయకుడు అని పేర్కొన్నారు. ఐటీ రంగానికి పునాదులు వేసి, 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించిన సంస్కరణ కర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. దేశ ఐక్యత కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానీయుడని, రాజీవ్ గాంధీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు తొలేం నాగేశ్వరరావు, మోకాళ్ళ పాపారావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నేతాజీ, జట్ల సత్యం, నాయకులు ఎర్ర సురేష్, పూజారి వెంకన్న, పోలేబోయిన సీతారాంబాబు, పూణేం బుచ్చయ్య, గొగ్గలి రవి, వగలబోయిన శ్రీను, గాంధర్ల రామనాథం, కరకపల్లి నాగేష్, దుర్గం కన్నయ్య, సురా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….