ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  నేరుగా విత్తే వరి సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన

నేరుగా విత్తే వరి సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఉప్పాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు “నేరుగా విత్తే వరి సాగు – యాజమాన్య పద్ధతులు” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా KVK ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భరత్ మాట్లాడుతూ –
“ఉప్పాకలో సుమారు 300 ఎకరాల్లో నేరుగా విత్తే వరి సాగు జరుగుతుండడం ఆనందదాయకం. నాటు వేసే విధానంతో పోలిస్తే ఈ పద్ధతిలో రైతులకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కూలీ ఖర్చులు తగ్గి, ఎకరానికి సుమారు రూ.5,000 వరకు పెట్టుబడి ఆదా అవుతుంది” అని తెలిపారు.

అలాగే కలుపు నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ విధానంలో నీటి అవసరం తక్కువగా ఉండటంతో రైతులకు మరింత అనుకూలం అవుతుందని చెప్పారు. వరి పొలాల్లో అజోల్లా వాడకం వల్ల నత్రజని నేరుగా పంటకు అంది, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవచ్చని కూడా రైతులకు వివరించారు.

కార్యక్రమంలో మణుగూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బి. తాతారావు, పినపాక ఎంఏఓ వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ అధికారి శివ, ఎక్స్టెన్షన్ శాఖ హరిశ్చంద్ర, ఏఈఓలు కె. రమేష్, ఎస్. నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు మాట్లాడుతూ –
“భవిష్యత్తులో ఉప్పాక గ్రామం భద్రాద్రి జిల్లా రైతులందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….