ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

ఆదివాసుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు సాగాలి: సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం, ఆగస్టు 09 (ఆధాబ్ న్యూస్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండల కేంద్రంలో మండల JAC కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఆదివాసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ZP చైర్మన్ డా. చందా లింగయ్య దొర హాజరయ్యారు. మండల కేంద్రంలోని బ్యాంకు వద్ద నుంచి ఆదివాసులు, JAC నాయకులు, సర్పంచులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి డోలు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీగా బట్టుపల్లి (విరాపురం) ఎక్స్‌ రోడ్ వద్ద ఉన్న ఆదివాసీ ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ విగ్రహం వద్దకు చేరుకుని ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను కాపాడుకుంటూ సమాజ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని అన్నారు.

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జై ఆదివాసి, జై కొమరం భీమ్ నినాదాలతో కరకగూడెం మండల కేంద్రం మార్మోగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….