ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కొత్తగూడెం ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

 

కొత్తగూడెం ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం

కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మంగళవారం సందర్శించి అక్కడి పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థల అమలు, సైబర్ నేరాల నియంత్రణ చర్యలు, సాంకేతిక సేవల వినియోగంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సీఈఐఆర్ (CEIR), సీసీటీఎన్‌ఎస్ (CCTNS), ఈ-సాక్ష్య (e-Sakshya), నాట్‌గ్రిడ్ (NATGRID) వంటి ఆధునిక డిజిటల్ వ్యవస్థలను పూర్తి స్థాయిలో వినియోగించి, సైబర్ నేరాల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసును త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ సముద్రాల జితేందర్, ఎస్‌ఐలు జుభేదా, గణేష్తో పాటు ఐటీ కోర్, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….