కరకగూడెం నూతన ఎంపీడీవో శ్రీనివాసరావుకు కాంగ్రెస్ నేతల ఘన సన్మానం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) బాధ్యతలు స్వీకరించిన పోడిల శ్రీనివాసరావును మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందిస్తూ మండల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో చేరేలా కృషి చేయాలని కోరారు. నూతన ఎంపీడీవో శ్రీనివాసరావు తన పదవిలో విజయవంతంగా సేవలందించాలని అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు చౌలం కేశవరావు, ఉపాధ్యక్షుడు కల్తీ విజయ్, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, బట్టుపల్లి సర్పంచ్ తోలెం రమాదేవి, చిరుమల్ల సర్పంచ్ కొమరం సుగుణ, రేగళ్ల సర్పంచ్ బాడిష పార్వతి, పద్మాపురం సర్పంచ్ తోలెం రమేష్, చొప్పాల సర్పంచ్ తోలెం సావిత్రి, గొల్లగూడెం సర్పంచ్ ఏళ్లబోయిన ముత్తమ్మ, మాజీ ఉపసర్పంచులు కొమరం వెంకటేశ్వర్లు, బాడిష లక్ష్మీనారాయణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









