కరకగూడెం సెంటర్లో విస్తృత వాహన తనిఖీలు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు తనిఖీలు
కరకగూడెం, జూలై 23 (ఆధాబ్ న్యూస్): జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో గురువారం కరకగూడెం సెంటర్లో ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి తనిఖీ చేశారు. అలాగే కూలీలను తరలిస్తున్న వాహనాలను ఆపి భద్రతా ప్రమాణాలు, రవాణా నిబంధనలపై పరిశీలన నిర్వహించి వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని ఎస్సై పి.వి.ఎన్. రావు సూచించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కనకేష్ కుమార్తో పాటు కరకగూడెం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 85









