ఆధాబ్ న్యూస్ కథనానికి అధికారుల తక్షణ స్పందన
పెంటన్నగూడెం ఎంపీపీఎస్లో బాత్రూం తాళాలు తొలగింపు.. విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి
పినపాక, జూలై 22 (ఆధాబ్ న్యూస్):
ఆధాబ్ న్యూస్లో ప్రచురితమైన “మూడేళ్లుగా అందని బిల్లులు.. మూలనపడ్డ పాఠశాల బాత్రూంలు” కథనానికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. పినపాక మండలం పెంటన్నగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడేళ్లుగా తాళాలు వేసి ఉన్న బాలురు, బాలికల బాత్రూంలను అధికారులు పరిశీలించి తాళాలు తొలగించి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
కథనం వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బాత్రూంలకు ఉన్న తాళాలను తొలగించి, విద్యార్థులు వెంటనే వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.
ఇప్పటి వరకు బాత్రూంలు అందుబాటులో లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
పాఠశాలలో మిగిలిన మౌలిక వసతుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు అధికారులను కోరారు.
ఫోటో క్యాప్షన్: పెంటన్నగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో బాత్రూంలను పరిశీలించి తాళాలు తొలగిస్తున్న సంబంధిత అధికారులు.










