సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లా రైతాంగానికి అందించాలి: బీఆర్ఎస్ నేతలు
చలో మణుగూరు పిలుపు నేపథ్యంలో కరకగూడెంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
ఆధాబ్ న్యూస్, కరకగూడెం, జూలై 16:
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ‘చలో మణుగూరు’ పిలుపు నేపథ్యంలో కరకగూడెం మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ముందస్తు అరెస్టు చేసిన వారిలో రావుల సోమయ్య, బుడగం రాము, రేగా సత్యనారాయణ, కొమరం రాంబాబు, కొమరం సత్యనారాయణ, రావుల కనకయ్య, అత్తె సత్యనారాయణ, మలకం వెంకటేశ్వర్లు, గుడ్ల రంజిత్ కుమార్, పాయం కృష్ణ, దాసరి సాంబయ్య, చిట్టిమల్ల ప్రవీణ్, బందు సతీష్ ఉన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, “సీతారామ ప్రాజెక్టు నీటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి అందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ముందస్తు అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని” స్పష్టం చేశారు. రైతుల హక్కుల కోసం తమ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.









