ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

 

ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం, మే 29 (ఆధాబ్ న్యూస్): జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా అధికారులు కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన పోలీసు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కేసుల విచారణలో జాప్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించిన ఎస్పీ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి హాట్‌స్పాట్లను గుర్తించి రవాణాదారులతో పాటు వినియోగదారులపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానితులకు గంజాయి రాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ మోసాల బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి వారికి అండగా నిలవాలని తెలిపారు. డయల్-100కు వచ్చే ఫిర్యాదులపై కూడా వేగంగా స్పందించాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించిన ఎస్పీ, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….