ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు

  ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం… రూ.20 వేల లంచం డిమాండ్ ఆరోపణలతో చెకింగ్ అధికారిపై దాడి

ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం… రూ.20 వేల లంచం డిమాండ్ ఆరోపణలతో చెకింగ్ అధికారిపై దాడి

సంగారెడ్డి,ఆధాబ్ న్యూస్:

హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద టికెట్ స్క్వాడ్ తనిఖీ కోసం బస్సును ఆపింది.

తనిఖీ సందర్భంగా ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడం గమనించిన చెకింగ్ అధికారి, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే ప్రయాణికుడితో పాటు కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కండక్టర్ మరియు కొంతమంది ప్రయాణికులు చెకింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కండక్టర్ చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టినట్లు సమాచారం. కొందరు ప్రయాణికులు కూడా అధికారిపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో ఆర్టీసీ వ్యవస్థలో తనిఖీల సమయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….