ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

హైదరాబాద్,ఏప్రిల్ 12 ఆధాబ్ న్యూస్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) మే/జూన్ 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. జనరల్ మరియు వొకేషనల్ కోర్సులకు చెందిన 1వ సంవత్సరం, 2వ సంవత్సరం విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

థియరీ పరీక్షలు మే 13 నుండి ప్రారంభమై మే 21 వరకు కొనసాగనున్నాయి. 1వ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2వ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయి.

ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుండి మే 25 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 26న ఇంగ్లీష్ ప్రాక్టికల్ మరియు ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు, మే 28న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

ఈ తేదీలు వొకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా వర్తిస్తాయని, అయితే వాటి ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను తరువాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని, అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండాలని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….