ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  రెండో రోజు ఉత్సాహంగా జర్నలిస్ట్ కప్ క్రికెట్ పోటీలు

రెండో రోజు ఉత్సాహంగా జర్నలిస్ట్ కప్ క్రికెట్ పోటీలు

పినపాక, ఆధాబ్ న్యూస్
పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్చిరెడ్డిపల్లి క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ సందర్భంగా మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి, ఎస్ఐలు సురేష్, నాగుల్ మీరా గౌరవ అతిథులుగా హాజరై ఆటల్లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యతను పెంపొందించడం, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ అభినందనీయమని తెలిపారు. పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని సూచించారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీకి అభినందనలు తెలిపారు.

రెండో రోజు జరిగిన మ్యాచ్‌లలో పినపాక ప్రజాప్రతినిధులు – కరకగూడెం జర్నలిస్టుల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరకగూడెం జర్నలిస్టులు విజయం సాధించారు. ఉపాధ్యాయులు – బిటిపిఎస్ జెపిఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బిటిపిఎస్ జెపిఎ జట్టు గెలుపొందింది. పినపాక పోలీస్ – కరకగూడెం ఎంపీడీవో కార్యాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పోలీస్ జట్టు విజయం సాధించింది. ఎక్సైజ్ విభాగం – పినపాక ఎంపీడీవో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పినపాక ఎంపీడీవో జట్టు గెలిచింది.

కరకగూడెం ప్రెస్ క్లబ్ కెప్టెన్ దుర్గం ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో సురేష్, ప్రవీణ్, సురేందర్, రంజిత్, దిలీప్, హనుమంతరావు, ప్రవీణ్ ఫరూఖ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….