ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఉచిత రక్తదానం సేవలు

సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఉచిత రక్తదానం సేవలు

కరకగూడెం,ఫిబ్రవరి 21 ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మోతె గ్రామానికి చెందిన మెంతిని సాగర్ ఆధ్వర్యంలో నడుస్తున్న సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఉచిత రక్తదానం సేవలు అందిస్తున్నారు.

అసోసియేషన్ అధ్యక్షుడు మెంతిని సాగర్ మాట్లాడుతూ, యాక్సిడెంట్లు, గర్భిణీ స్త్రీలు, థలసేమియా, క్యాన్సర్ బాధితులు, శస్త్రచికిత్సలు వంటి అనేక సందర్భాల్లో రక్తం అత్యవసరంగా అవసరమవుతుందని తెలిపారు. అయితే పేదవారు రక్తం దొరకక, డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో పేదలకు ఉచితంగా రక్తం అందించాలనే లక్ష్యంతో 12-01-2026న సంస్థను నమోదు చేసి, ఇప్పటివరకు 14 మందికి రక్తదానం సేవలు అందించామని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చని సూచించారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో అనేకసార్లు రక్తదానం చేయవచ్చని, రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తకణాలు ఏర్పడటం, ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిపారు.

ప్రజలు అపోహలు వీడి రక్తదానం చేయడానికి ముందుకు వస్తే, అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు. రక్తదాతలు ముందుకు రావాలని అసోసియేషన్ అధ్యక్షుడు మెంతిని సాగర్, జనరల్ సెక్రటరీ గిద్దె విష్ణు పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….