ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  తెలంగాణలోని వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ మారింది.

వాహనాల రిజిస్ట్రేషన్ సాధారణంగా ఆయా రాష్ట్రాల పేర్లతోనే ప్రారంభమౌతుంటుంది. రాష్ట్రపేరులోని అక్షరాలే రిజిస్ట్రేషన్ సిరీస్‌గా ఉంటాయి. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వేర్వేరు అక్షరాలతో టీఎస్‌గా నిర్ణయించింది. గత పదేళ్ల నుంచి కొత్త వాహనాలకు టీఎస్ సిరీస్‌తోనే రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ఇప్పుడు మరోసారి వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతోంది.

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చే ప్రక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చేందుకు సిద్ధమైంది. టీఎస్ కాకుండా టీజీ సిరీస్ ఉండాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోరిన మార్పుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..గెజిట్ నోటీఫికేషన్ సైతం జారీ చేసింది. ఇక నుంచి తెలంగాణలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ టీఎస్ కాకుండా టీజీ ఉంటుంది. ఇప్పటి వరకూ వాడుకలో ఉన్న టీఎస్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఇకపై రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ కాకుండా టీజీతో మొదలవుతుంది.

దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మార్చాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన ప్రభుత్వం టీజీగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త నోటిఫికేషన్ తక్షణమే అంటే మార్చ్ 12, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే టీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలను మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వాడుకలో ఉన్నవి చెల్లుతాయి. కొత్తగా అంటే మార్చ్ 12 నుంచి మాత్రం కొత్త రిజిస్ట్రేషన్ టీజీ ఉంటుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….