ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  రైతు సదస్సు వీక్షణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులకు ఆదేశాలు

రైతు సదస్సు వీక్షణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
రైతు భరోసా కార్యక్రమం కింద రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నింటికీ రూ.9,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే రైతు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నాడు.

ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని రైతు వేదికల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించాడు.

జిల్లావ్యాప్తంగా ఉన్న 58 రైతు వేదికలలో కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు స్క్రీన్లు, మైకులు, టెంట్లు వంటి సాంకేతిక సదుపాయాలను సమకూర్చాలని కలెక్టర్ సూచించాడు. మంగళవారం రైతు వేదికలను పండుగ వాతావరణంలో మామిడి తోరణాలు, రంగవల్లులతో అలంకరించాలన్నాడు. అదే రోజు సాయంత్రం 4 గంటలకే రైతులు వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపాడు.

ఆడియో, వీడియో ప్రసారాల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు పరీక్షలు నిర్వహించాలని సూచించాడు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కుర్చీలు, మంచినీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించాడు. మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రచారం నిర్వహించాలని సూచించాడు.

ప్రతి రైతు వేదిక వద్ద రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల వారీగా ఎంతమందికి ఎంత మొత్తం రైతు భరోసా జమ అయ్యిందో సమాచారం అందుబాటులో ఉంచాలన్నాడు. రైతుల హాజరు వివరాలు నమోదు చేసి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించాడు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….