కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఆధాబ్ న్యూస్ ,కరకగూడెం: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పీవీఎన్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ పీవీఎన్ రావు మాట్లాడుతూ.. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని అన్నారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, ప్రజలకు ఏ సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ పీవీఎన్ రావు తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 68









