ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఆవు…

 

వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఆవు… 

కరకగూడెం, ఆగస్టు 7 (ఆధాబ్ న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చుకు చిక్కి ఓ ఆవు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

స్థానిక రైతు పోలేబోయిన వెంకయ్యకు చెందిన ఆవు ప్రతిరోజులాగే గడ్డి మేత కోసం అడవికి వెళ్లగా, వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుంది. ఉచ్చు నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

సమాచారం అందుకున్న యజమాని ఘటనాస్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని తెలిపారు.

అటవీ ప్రాంతాల్లో అక్రమంగా ఉచ్చులు ఏర్పాటు చేయడం వల్ల వన్యప్రాణులతో పాటు పశువులు కూడా బలవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించి ఉచ్చులు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ పరిసర అటవీ ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….