ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం: చుంచు రామకృష్ణ (DE)

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం: చుంచు రామకృష్ణ (DE)

ఆధాబ్ న్యూస్, కరకగూడెం ఆగస్టు 6:

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ ఆదివాసీ ర్యాలీ, సాంస్కృతిక ప్రదర్శనలు, బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ (DE) పిలుపునిచ్చారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేపట్టిన జోడా యాత్రలో భాగంగా గురువారం ఆయన కరకగూడెం మండల కేంద్రంలో పర్యటించి స్థానిక ఆదివాసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల ఉనికి, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానం, రాజ్యాంగం కల్పించిన హక్కులను చాటిచెప్పే చారిత్రాత్మక దినమని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్, పీసా (PESA) చట్టం, అటవీ హక్కుల చట్టం–2006 వంటి చట్టాలు ఆదివాసీల రక్షణ కోసం రూపొందించినప్పటికీ, వాటి సంపూర్ణ అమలుకు ఇంకా కృషి అవసరమని అన్నారు. ఆదివాసీ ప్రజలు తమ హక్కులపై పూర్తి అవగాహనతో ఐక్యంగా ముందుకు సాగితేనే రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో సాధించగలరని తెలిపారు.

ఆగస్టు 9న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి, డోలు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో వేలాదిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు, ఆదివాసీ నాయకులు ఐక్యంగా పాల్గొని ఆదివాసీల ఐక్యతను ప్రపంచానికి చాటాలని కోరారు.

అనంతరం మండల నాయకులతో సమావేశమై ఆగస్టు 9 కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, గ్రామాల వారీగా ప్రజల సమీకరణ, రవాణా సౌకర్యాలు, ప్రచార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ప్రజలను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, వివిధ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మండలంలోని పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….