కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో డాక్టర్ అరుణ బాధ్యతల స్వీకరణ
కరకగూడెం, జూలై 22 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండల ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో నూతన వైద్యాధికారిగా డాక్టర్ గుమ్మడి అరుణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆయుర్వేద వైద్య సేవలు, మందులను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మధుమేహం, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు తదితర వ్యాధులకు ఆయుర్వేదంలో సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
రోగులు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిని సంప్రదించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని డాక్టర్ గుమ్మడి అరుణ తెలిపారు.









