ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  వైద్య వ్యవస్థ వైఫల్యాలపై ప్రజావాణిలో బీఆర్ఎస్ ఆందోళన గర్భిణుల మరణాలు, వైద్యుల నిర్లక్ష్యం, 108 సేవల వైఫల్యంపై కలెక్టర్‌కు వినతిపత్రం

వైద్య వ్యవస్థ వైఫల్యాలపై ప్రజావాణిలో బీఆర్ఎస్ ఆందోళన

గర్భిణుల మరణాలు, వైద్యుల నిర్లక్ష్యం, 108 సేవల వైఫల్యంపై కలెక్టర్‌కు వినతిపత్రం

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 20 (ఆధాబ్ న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవల పనితీరు, వైద్యుల నిర్లక్ష్యం, అత్యవసర వైద్య సేవల లోపాలపై బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ సింధు తపస్వి ఆధ్వర్యంలో మహిళలు సోమవారం నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందడం లేదని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పలు ఘటనలను ఉదాహరణగా చూపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వినతిపత్రంలో ప్రస్తావించిన ముఖ్య ఘటనలు:

• గర్భిణీ నిలబడి ప్రసవించిన ఘటన: జూలై 15, 2026న కొత్తగూడెం రామవరంలోని ప్రభుత్వ మాతా-శిశు సంరక్షణ కేంద్రంలో దమ్మపేటకు చెందిన భవాని అనే గర్భిణీ సకాలంలో వైద్యసేవలు అందక నిలబడి ప్రసవించాల్సి వచ్చిన ఘటన.

• గుండాలలో మాతా-శిశువు మరణం: జూన్ 2026లో గుండాల పీహెచ్‌సీ పరిధిలోని శంభునిగూడెం గ్రామానికి చెందిన కుంజ వనజ అనే గర్భిణీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ఘటన.

• 108 అంబులెన్స్ అందుబాటులో లేక ఆటోలోనే ప్రసవం: అమరారం గ్రామానికి చెందిన కలివేటి సంధ్యకు అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ అందుబాటులోకి రాకపోవడం, జనంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ వైద్యులు లేకపోవడంతో పినపాకకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆటోలోనే ప్రసవించాల్సి వచ్చిన ఘటన.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, 108 అంబులెన్స్ సేవలను బలోపేతం చేయాలని, గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని బీఆర్ఎస్ నాయకులు జిల్లా అధికారులను కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….