కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 313 మంది విద్యార్థినులకు ఏకరూప దుస్తుల పంపిణీ
ఆధాబ్ న్యూస్, కరకగూడెం, జూలై 14:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం 313 మంది విద్యార్థినులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా టైలర్లకు అందజేసిన మెరూన్ రంగు వస్త్రంతో కుట్టించిన ఏకరూప దుస్తులను విద్యార్థినులకు అందించి, వాటి వినియోగం ద్వారా విద్యార్థుల్లో సమానత్వ భావన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి జి. మంజుల, సెర్ప్ ఏపీఎం బి. వినోద్ క్రాంతి, విద్యాలయం ఇన్చార్జి ప్రత్యేక అధికారి నసీమా, ఇంటర్ విద్యాధికారి సంధ్యారాణి, విద్యాలయ సిబ్బంది, సెర్ప్ మహిళా టైలర్లు శ్రీదేవి, స్ఫూర్తి, కవితతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.









