ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  గిరిజన రైతుల ముఖాల్లో ఆనందం.. తొగ్గుడెం గ్రామానికి 12 పోడు పట్టాలు పంపిణీ

గిరిజన రైతుల ముఖాల్లో ఆనందం.. తొగ్గుడెం గ్రామానికి 12 పోడు పట్టాలు పంపిణీ

భద్రాచలం,ఆధాబ్ న్యూస్ 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం తొగ్గుడెం గ్రామానికి చెందిన 12 మంది గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పంపిణీ చేశారు. భద్రాచలంలోని ఐటిడిఎ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు చట్టబద్ధమైన హక్కులు రావడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు రావడం వల్ల గిరిజన కుటుంబాల జీవనోపాధి మరింత బలపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సాగునీటి సౌకర్యాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌వో, తొగ్గుడెం సర్పంచ్ మడకం కృష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, పోడు పట్టాదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….