ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి – రాజమండ్రిలో కలకలం

కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి – రాజమండ్రిలో కలకలం
ఏపీ, ఆధాబ్ న్యూస్;
తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి
కల్తీ పాలు తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఈ ఘటన జిల్లాలో తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

తాజాగా దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు మృతి చెందారు. అంతకుముందు చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన కనక రత్నం సహా మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారులు ప్రస్తుతం రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంటింటా సర్వే – అధికారులు అప్రమత్తం

లాలాపేట చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో అధికారులు ఇంటింటా సర్వే చేపట్టారు. ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల్లో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మీడియాతో మాట్లాడుతూ,

కల్తీ పాలు కారణంగా అస్వస్థత ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

పాల సరఫరా చేసిన వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు.

వ్యాపారి 46 మంది రైతుల వద్ద నుంచి పాలు సేకరించి, 106 కుటుంబాలకు సరఫరా చేసినట్లు వెల్లడించారు.
నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు

ఇప్పటి వరకు 73 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల ఫలితాలు త్వరలో వెల్లడవుతాయని పేర్కొన్నారు.

అనారోగ్యానికి గురైన వారు వెంటనే కాల్ సెంటర్ నంబర్ 94940 60060 కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
మెటీరియల్ సీజ్ – 12 కేసులు నమోదు

జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ,

పాల వ్యాపారి ఇంటి వద్ద ఉన్న మెటీరియల్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని కోరారు.

జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపిన ప్రకారం,
ఇప్పటి వరకు 12 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఐదుగురు మృతి చెందగా, పలువురు చికిత్స పొందుతున్నారు.

⚠️ ప్రజలకు సూచనలు

అనుమానాస్పద పాలు లేదా ఆహార పదార్థాలు వినియోగించవద్దు

ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి

అధికారులకు సమాచారం ఇవ్వాలి
ఈ ఘటనపై పూర్తి వివరాలు ఫోరెన్సిక్ నివేదిక అనంతరం వెలువడే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….