ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  కేసీఆర్‌కు సిట్ నోటీసుపై కరకగూడెంలో బీఆర్‌ఎస్ నిరసన

కేసీఆర్‌కు సిట్ నోటీసుపై కరకగూడెంలో బీఆర్‌ఎస్ నిరసన

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసు ఇవ్వడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.

మండల బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోగు వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా అధ్యక్షుడు సిద్ధి సునిల్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ కార్యాలయం ఎదుట  నిరసన తెలిపారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీలు, వందల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రాజకీయ కక్షతో సిట్ పేరిట బీఆర్‌ఎస్ నాయకులను వేధిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించలేకే ఈ ప్రభుత్వం డ్రామాలకు తెరలేపిందన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ మురికి రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కొమరం సత్యనారాయణ, వట్టం సందీప్, ఉపసర్పంచ్ బుడగం రాము, ఊకె రామనాధం, పోలేబోయిన నర్సింహారావు, పాయం నర్సింహారావు, ఎల్లు రామకృష్ణ రెడ్డి, గుమ్మడివెల్లి ప్రసాద్, కట్టుకోజ్వల వేణు, రావుల కనకయ్య, చందా వసంతరావు, గొగ్గలి శ్రీను, యల్లగొండ శ్రీను, దాసరి సాంబయ్య, అజ్జు, నాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….