ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  విపిఎల్-5 కప్ విజేతగా సివిల్ (మణుగూరు) జట్టు కొత్తూరు కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపు

విపిఎల్-5 కప్ విజేతగా సివిల్ (మణుగూరు) జట్టు
కొత్తూరు కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపు

తాడ్వాయి,ఆధాబ్ న్యూస్: దసరా పండుగ సందర్భంగా తాడ్వాయి మండలంలోని రంగాపురం స్కూల్ మైదానంలో నిర్వహించిన విపిఎల్-5 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో సివిల్ (మణుగూరు) జట్టు కొత్తూరు కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచి విజేతగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రధాన అతిథులుగా హాజరైన చెన్నూరు శేషు బాబు, కొపెల్ల కిరణ్ ప్రసాద్, కొమరం వెంకటనారాయణ విజేత జట్టుకు రూ.20,116 నగదు బహుమతి మరియు రన్నరప్ జట్టైన కొత్తూరు కింగ్స్‌కు రూ.10,116 నగదు బహుమతి అందజేశారు.

ముఖ్య అతిథులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఉన్నారని, పట్టణాల్లో జరిగే ఐపీఎల్ తరహా ఆక్షన్ టోర్నమెంట్‌లను గ్రామీణ స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తేవడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇర్ప సూర్యం, జివ్వాజి మోహన్ రావు, గుమ్మడి ముత్తయ్య, సీనియర్ ప్లేయర్ భానుప్రసాద్, టోర్నీ నిర్వాహకులు రంజిత్, ప్రసాద్, గోపి, సుధాకర్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….