ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం పై ఆగ్రహం .

ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం పై ఆగ్రహం

మణుగూరు ఆధాబ్ న్యూస్:
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీపై ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, మణుగూరు మండల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నట్లు ఆరోపించారు.

పాఠశాలలు ఫీజులకు తోడు, యూనిఫామ్, పుస్తకాలు, నోటుబుక్స్, బస్సు ఛార్జీలు వంటి అదనపు ఖర్చులను కూడా భరింపజేస్తున్నాయని తెలిపారు. ఈ విధంగా సామాన్య తల్లిదండ్రుల ఆకాంక్షను అవకాశంగా మలచుకుంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచి ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కొందరు తల్లిదండ్రులు వడ్డీపై డబ్బులు తెచ్చి పిల్లలను చదివించాల్సిన పరిస్థితి ఉందని, ఇది వారి ఆర్థిక స్థితిని దిగజారుస్తోందని తెలిపారు.

విద్యాశాఖ ఉదాసీనతపై విమర్శలు:

విద్యాశాఖ అధికారులు ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జి.ఓ. నెం.1 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల పుస్తకాలనే ప్రైవేట్ పాఠశాలల్లో ఉపయోగించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అలాగే అడ్మిషన్ ఫీజు వసూలు చేయడానికి ఎలాంటి అనుమతులేదు అని తెలిపారు.

ఎంఈఓ స్పందన:

ఈ సందర్భంగా ఎంఈఓ స్వర్ణజ్యోతి మాట్లాడుతూ, “ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫామ్, పుస్తకాలు అమ్మితే చర్యలు తప్పవు. ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు జిమ్మిడి ప్రకాష్, గోగు సాయి, బాడిస సువాస్, వంశి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎన్‌ఎస్ఎఫ్ స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….