ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కణితి సతీష్ హత్య కేసు – ప్రధాన నిందితుడు అరెస్ట్

కణితి సతీష్ హత్య కేసు – ప్రధాన నిందితుడు అరెస్ట్
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలంలో జూన్ 7న జరిగిన కణితి సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ కుమార్ సింగ్ (IPS) స్వయంగా పర్యవేక్షిస్తూ, నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ప్రధాన నిందితుడైన గుంజ సాయిరాం అనే వ్యక్తిని జూన్ 9న భద్రాచలం పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం అతడిని భద్రాచలం ప్రధమ శ్రేణి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగరాజు, ఎస్‌ఐలు స్వప్న, సతీష్, రామకృష్ణ లు మరియు వారి సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.

అరెస్ట్ చేసిన నిందితుడి వివరాలు ఇలా ఉన్నాయి:
🔹 పేరు: గుంజ సాయిరాం
🔹 తండ్రి పేరు: ఏడుకొండలు
🔹 వయస్సు: 32 సంవత్సరాలు
🔹 కులం: వడ్డెర
🔹 వృత్తి: కూలీ
🔹 నివాసం: జగదీష్ కాలనీ, భద్రాచలం

పోలీసు శాఖ మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నమ్మకంగా తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….